PRABHATHA SURYUDU
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:12 am Posted by : PRABHATHA SURYUDU

అర్ధరాత్రి పాన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష

నిషేధిత సమయాల్లో పాన్ షాప్ నిర్వహణ.. హయత్‌నగర్‌లో వ్యక్తికి 2 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

హయత్‌నగర్, ప్రభాత సూర్యుడు

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సమయాల్లో పాన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై పోలీసులు చర్యలు చేపట్టారు. సయ్యద్ ఇమ్రాన్ రహీమ్ (35), హయత్‌నగర్ జీ స్కూల్ ప్రాంతంలో నిషేధిత అర్ధరాత్రి వేళల్లో పాన్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితుడికి 2 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం అతడిని చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనలు, పోలీసు శాఖ సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయాల్లో మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని హయత్‌నగర్ సిఐ నాగరాజు సూచించారు.