స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పైకి కదలగా, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు పెరుగుదల
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరగడంతో ప్రస్తుతం రూ.1,31,500కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.170 పెరిగి రూ.1,43,460 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలో స్వల్ప తగ్గుదల
మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,34,900 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు
హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఇదే ధరలు అమలులో ఉండనున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా మార్కెట్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
For Related Link :
For Our More News Click Here:

