ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడ్యుకేషన్Education Ministry: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీ

Education Ministry: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషీ

📰 Generate e-Paper Clip

కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషీకి.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ – ప్రభాత సూర్యుడు:

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Union Minister Prahlad Joshi given additional charge of Education Ministry

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ పరిపాలనలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు ప్రహ్లాద్ జోషీ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

త్వరలో కొత్త విద్యాశాఖ మంత్రి నియామకం

విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించే అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు శాఖకు సంబంధించిన అన్ని కీలక వ్యవహారాలను ప్రహ్లాద్ జోషీ పర్యవేక్షించనున్నారు.

For Related Link : https://www.rashtrapatibhavan.gov.in/


For Our More News Click Here: https://prabhathasuryudu.com/telangana-new-enforcement-wing-on-revenue-leakages/

spot_img
RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!