LATEST TELANGANA NEWS : విన్పపాలు వినవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి

TG CM REVANTH REDDY MET PM NARENDRA MODI IN DELHI

On
LATEST TELANGANA NEWS  : విన్పపాలు వినవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి

విన్పపాలు వినవలె
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి

న్యూఢల్లీి - ప్రభాత సూర్యుడు 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ లో రాష్ట్రానికి కావాల్సిన కీలకమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరుగుతాయనుకున్నారు. కానీ.. ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించకపోవడంతో.. సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రధాని మోదీని నేరుగా కలుసుకున్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ అంశాలపై ప్రత్యేక వినతులు అందించిన రేవంత్‌ రెడ్డి.. నిధులు, అనుమతులు, కొత్త ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చించారు. దిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్‌.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మించ తలపెట్టిన రెండో దశ మెట్రో నిర్మాణం గురించి ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుండడంతో.. ఆ విషయాన్ని ప్రస్తావించిన రేవంత్‌ రెడ్డి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. హైదరాబాద్‌ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసురావడమే తమ ఉద్దేశమని వెల్లడిరచారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఫేజ్‌`ఎఎ కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.విూ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించినట్లు ప్రధాని మోదీకి వివరించారు.రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. ఈ రీజినల్‌ రింగ్‌ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో కనెక్టవిటీ సులభమవుతుందని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్‌ రెడ్డి తెలియజేశారు.. రీజినల్‌ రింగ్‌ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్‌ రింగు రోడ్డు సవిూపంలో డ్రైపోర్ట్‌ అవసరమని, ఆ డ్రైపోర్ట్‌ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్‌ లను కలిపేందుకు గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీకి విన్నవించారు.తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని? రాజధాని హైదరాబాద్‌ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని పీఎంకు వివరించారు. రాష్ట్రంతో అంతటి ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధానిని కోరారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్‌ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్‌ వాల్స్‌, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని పీఎంకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. సెవిూ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెవిూ కండక్టర్‌ మిషన్‌ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

Views: 0

Latest News